ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పాఠశాల తరగతి గదుల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 03:19 PM

ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతుండటంతో జనం అనారోగ్యాలపాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం కాపాడేందుకు తరగతి గదుల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఢిల్లీలోని 38 వేల స్కూళ్లలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వాటి ఫలితాలు త్వరలోనే క్షేత్రస్థాయిలో కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ సెస్ నిధులను ఉపయోగించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెకానికల్ రోడ్ స్వీపర్‌‌ ను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa