ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2029 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 01:21 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన జగన్, అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, 2029 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. "ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లతో భారీ మెజారిటీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం," అని ఆయన జోస్యం చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200కు పైగా సీట్లు గెలుస్తామని, ఒకవేళ 175 స్థానాలే కొనసాగితే గతంలో సాధించిన 151 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa