ఐదు టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపారు.అనారోగ్యంతో ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ దీప్తి శర్మ పాల్గోలేకపోవడం కూడా హర్మన్ పేర్కొన్నారు.“టాస్ గెలవడం సాధారణంగా నా అలవాటు కాదు, కానీ ఇది ఆస్వాదించదగిన విషయం. టాస్ నా చేతుల్లో ఉండదు కాబట్టి, గెలిస్తే సంతోషంగా ఉంటోంది. ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాం. దీప్తి అనారోగ్యంతో బయట ఉన్నందున, ఆమె స్థానంలో స్నేహ్ రాణా జట్టులోకి వచ్చారు. వికెట్ పరిస్థితులు చాలా బాగున్నాయి,” అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పారు.గత మ్యాచ్లో పిచ్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. “మేం మా ప్రణాళికల ప్రకారం ఆడతాం. గత మ్యాచ్ తరహా జోరును ఈ రోజు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం,” అని ఆమె చెప్పారు.టాస్ ఓడినా వారికెంతా సౌకర్యంగా ఉందని శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు పేర్కొన్నారు. “మేము అదే కాంబినేషన్తో బరిలోకి వస్తున్నాం. తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ, నా జట్టుపై నాకు నమ్మకం ఉంది. కొందరు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు ఇది సరైన సమయం. మిడిల్ ఓవర్లలో పాజిటివ్ క్రికెట్ ఆడటం మా ప్రాధాన్యత. గత మ్యాచ్లో వికెట్ల వెనుకబైపు బహుళ షాట్లు ఆడాం, ఈ రోజు స్ట్రెయిట్గా ఆడటమే లక్ష్యం. లాంగాన్, లాంగాఫ్కి ఎక్కువ దృష్టి సారించి, భాగస్వామ్యాలను బలపరిచే ప్రయత్నం చేస్తాం. మా బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నాం,” అని చమరి తెలిపారు.ఐదు టీ20ల సిరీస్లో వైజాగ్ వేదికలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.
*తుది జట్లు:
-శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిష దిల్హారి, కౌషాని నుత్యంగన (వికెట్ కీపర్), మల్కి మదార, ఇనోకా రణవీర, కావ్య కావిండి, శశిని గిమ్హాని
-భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa