New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు ఇది కిక్ ఇచ్చే న్యూస్. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మద్యం షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరవడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.అదేవిధంగా, బార్లు, క్లబ్లు, పర్మిషన్ ఉన్న ఈవెంట్లు మరియు టూరిజం ప్రాంతాల్లో కూడా అర్థరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు.ఎక్సైజ్ శాఖ ఈ సందర్భానికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ప్రకారం, డిసెంబర్ 31న మద్యం షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు నిర్వహించవచ్చని అధికారికంగా వెల్లడించారు. అదనంగా, బయట రాష్ట్రాల నుంచి రవాణా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం పై సక్రమంగా నిఘా ఉంచారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారాలపై కూడా ప్రత్యేక టీమ్స్ తో దాడులు జరుపుతామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.మరోవైపు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించింది. డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఎన్డీపీఎల్, ఎన్డీపీఎస్లపై ప్రత్యేక దాడులు చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, గంజాయి, డ్రగ్స్పై తనిఖీలు జరిగాయి. వరంగల్ మరియు నాగర్కర్నూల్ జిల్లాల్లో ఐడీ లిక్కర్ (నాటుసారా)పై కూడా దాడులు చేశారు.డిసెంబర్ 30, 31న ప్రత్యేక ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్పోస్ట్లలో, రైళ్లు మరియు వాహనాల్లో అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచతామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa