ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 11:28 AM

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శుక్రవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూకంప కేంద్రం 23.65° నార్త్ లాటిట్యూడ్, 70.23° ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అధికారులు ప్రభావిత ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa