ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ

international |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 01:28 PM

భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రస్తుతం భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడిపీ) విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే 2030 నాటికి జర్మనీని కూడా అధిగమించి.. అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని తెలిపింది. దశాబ్దం చివరి నాటికి భారత జీడిపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీడిపీ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 7.8 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. గడచిన ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం. ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడిందని ప్రభుత్వం పేర్కొంది. దేశీయంగా ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa