ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ వలన త్వరలోనే నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 01:50 PM

ఏఐ పూర్తి స్థాయిలో పని చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అనుకునే వారికి ఇది కాస్త ఆలోచించాల్సిన హెచ్చరికే. ప్రపంచవ్యాప్తంగా ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పేరొందిన జెఫ్రీ హింటన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. 2025లోనే ఏఐ సామర్థ్యం ఏ స్థాయికి చేరిందో మనం చూసేశామని, ఈ వేగం ఇలాగే కొనసాగితే 2026 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.ప్రస్తుతం ఏఐ కేవలం సపోర్టింగ్ టూల్‌గా మాత్రమే కాకుండా, మనిషి మెదడు చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టిందని హింటన్ తెలిపారు. ముఖ్యంగా వైట్‌-కాలర్ ఉద్యోగాలు అంటే ఆలోచన, రచన, డేటా విశ్లేషణ, నిర్ణయాలు తీసుకునే పనులు చేసే ఉద్యోగాలు ఎక్కువ ముప్పులో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు ఇవి పూర్తిగా మనుషులకే సాధ్యమని భావించేవాళ్లం. కానీ ఇప్పుడు అదే పనిని ఏఐ వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల కంపెనీలు ఉద్యోగులను తగ్గించి, తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పని చేయించుకునే దిశగా వెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa