ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన 'ఆవకాయ్ – అమరావతి ఫెస్ట్వల్' కృష్ణా నదీ తీరాన ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయని కొనియాడారు.పర్యాటక రంగాన్ని అతిపెద్ద ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో లక్ష పర్యాటక గదులను అందుబాటులోకి తెస్తామని, సూర్యలంక బీచ్ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామన్నారు. అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్గా మారిందని గుర్తు చేశారు.దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయని వివరించారు. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని, పర్యాటకులు ఆకర్షితులవ్వాలంటే భద్రత, శుభ్రత కీలకమని ఆయన స్పష్టం చేశారు.తెలుగు సినిమా క్రియేటివిటీకి చిరునామా అని, భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే దీనికి నిదర్శమని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి సంప్రదాయాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa