ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 06:54 PM

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పనితీరును ఆయన ఆరాతీశారు. అంతకుముందు పిఠాపురంలో గొల్లప్రోలు హౌసింగ్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa