వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలువాసుల బాధలు వర్ణించడానికి మాటలు చాలవు. సుద్దగడ్డ వాగులో నీటి ప్రవాహం పెరిగితే రవాణా పూర్తిగా స్థంభిస్తుంది. వాగు మీద బ్రిడ్జి లేకపోవడంతో.. వర్షాలు వచ్చినప్పుడు జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండేవారు. విద్యార్థులు స్కూల్, కాలేజీలకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఈ సమస్య గురించి ఎన్ని సార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది. ఇక తమ పరిస్థితి ఇంతే అనే నిరాశలో మునిగిపోయి ఉన్నారు.
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక వారికి కొండంత భరోసా ఇచ్చింది. ఏడాదిన్నర క్రితం సుద్దగడ్డ వాగు సమస్య గురించి గొల్లప్రోలు ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్య తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. సుద్దగడ్డ వాగు మీద వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సంవత్సరంన్నర కాలం తిరిగే సరికి వంతెన నిర్మాణం పూర్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే.... ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన డిప్యూటీ సీఎంకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
గొల్లప్రోలులో దశాబ్దాలుగా ప్రజలను భయపెడుతున్న సుద్దగడ్డ వాగు సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపారు. వరదల సమయంలో కొత్త కాలనీవాసులు పడే ఇబ్బందులను గుర్తించిన పవన్.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు వంతెన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేశారు. రూ.2 కోట్లతో రక్షణ గోడలతో సహా వంతెన, రూ.1.10 కోట్లతో రెండు వైపులా గ్రావెల్, సిమెంట్ రోడ్లు నిర్మించారు. జనవరి 5న పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎంను స్థానికులు ఘనంగా స్వాగతించడానికి సిద్ధమయ్యారు.
గతంలో వర్షాకాలంలో సుద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు, గొల్లప్రోలులోని కొత్త కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది సెప్టెంబరులో వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పుడు వంతెన అందుబాటులోకి రావడంతో, సూరంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రమాదకరమైన కాలువ పక్కన వెళ్లాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా బడికి వెళ్లగలుగుతారు. రైతులు, ప్రజలు కూడా సుద్దగెడ్డ వాగు మీదుగా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ఈ దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం లభించడంతో గొల్లప్రోలు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంతెనను పరిశీలించడానికి వస్తున్న సందర్భంగా, స్థానికులు వంతెన వద్ద అందమైన ముగ్గులు వేసి, ప్లకార్డులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రజల కష్టాలు తీరడమే కాకుండా, సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa