ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజధాని అమరావతిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 05:29 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఏపీ పాలిటిక్స్‌లో అమరావతి మరోసారి చర్చనీయాంశమైంది. అమరావతి రెండో విడత భూసమీకరణపై స్పందిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు.. వాటికి కౌంటర్‌గా ఏపీ మంత్రుల ఎదురుదాడితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ క్రమంలోనే అమరావతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్టులో ఉత్సవాలు నిర్వహించారు. ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టులో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు.. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపారు.


తెలుగు పండుగలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్న వెంకయ్య నాయుడు.. భవిష్యత్ బాగుండాలంటే ప్రకృతితో కలిసి అందరూ జీవించాలని సూచించారు. పంటలు ఇంటికి చేరే సమయంలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటామని.. సంస్కృతిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు,ఈ క్రమంలోనే అమరావతి రాజధానిపై వెంకయ్య నాయుడు స్పందించారు.హైదరాబాద్‌ అద్భుతమైన నగరమన్న వెంకయ్య నాయుడు.. ఇలాంటి నగరమే ఆంధ్రప్రదేశ్ రాష్త్రానికి కూడా అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ తరహాలోఅమరావతి కూడా అభివృద్ధి చెందాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరూ రాజధాని నిర్మాణానికి సహకరించాలని సూచించారు.


అమరావతి అంటే విజయవాడ, గుంటూరు మాత్రమే కాదన్న వెంకయ్య నాయుడు.. ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. అమరావతి రాజధాని రాబోయే రోజులలో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంటుందని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రాంతామన్న వెంకయ్య నాయుడు.. ఎలాంటి వివాదాలను సృష్టించొద్దని పిలుపునిచ్చారు,


మరోవైపు అమరావతి రాజధానిలో భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండో విడత భూసమీకరణ చేపడుతోంది. రెండో విడతలో 16666 ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైపోయింది. అయితే మొదటి విడతలో సేకరించిన భూమిని అభివృద్ధి చేసి రైతులకు అప్పగించకుండానే.. రెండో విడత భూసమీకరణ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరం అవుతాయని.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి రాజధాని రగడ మొదలైంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa