ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాంఖడేలో భారత బ్యాటర్ల విధ్వంసం,,,,42 బంతుల్లో 89 రన్స్ చేసిన సంజూ,,,ఇంగ్లాండ్ ముందు 254 రన్స్ టార్గెట్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 10:27 PM

టీ20 ప్రపంచకప్ 2026 సెమీ ఫైనల్లో భారత బ్యాటర్లు పెను విధ్వంసం సృష్టించారు. ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగినా.. భారత బ్యాటర్లు ఏమాత్రం బెదరలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచినా.. మిగతా బ్యాటర్లు మాత్రం అదరగొట్టారు. వచ్చినవారు వచ్చినట్లే బౌండరీల మోత మోగించారు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో హీరో.. సంజూ శాంసన్ .. మరోసారి ఉపయుక్త ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. భారత్‌ను బ్యాటింగ్‌కు అప్పగించాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకునేందుకు అతడికి ఎంతో సమయం పట్టలేదు. అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమయ్యాడు. తొలి వికెట్ తర్వాత టీమిండియా విధ్వంసం మొదలైంది. దీంతో భారత్ స్కోరు జెట్‌ స్పీడులో దూసుకెళ్లింది. పవర్‌ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.


మరోవైపు సంజూ శాంసన్‌ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. మరోసారి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లో 89 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 39 రన్స్‌), శివమ్ దూబె (25 బంతుల్లో 43 రన్స్‌), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27 రన్స్‌), తిలక్ వర్మ (7 బంతుల్లో 21 రన్స్‌) సత్తాచాటారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.


ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2, విల్ జాక్స్ 2, జోఫ్రా అర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్‌ 4 ఓవర్లు వేసి.. 61 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. మిగతా బౌలర్లు కూడా పదికి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. అందులో ఇంగ్లాండ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఏకంగా.. 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి.. 61 పరుగులు సమర్పించుకున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa