ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజురోజుకి పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 04:11 PM

అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు సోమవారం గరిష్ఠ స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై ఆ దేశ న్యాయ శాఖ ఒత్తిడి పెంచడం, ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు పరుగులు తీశారు.సోమవారం మార్కెట్లో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి కాంట్రాక్ట్ బంగారం ధర 1.46 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,40,838 పలికింది. అదేవిధంగా, మార్చి కాంట్రాక్ట్ వెండి ధర ఏకంగా 3.66 శాతం ఎగబాకి కిలోకు రూ. 2,61,977 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,601 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa