ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం లో కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి సత్య కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 01:48 PM

ధర్మవరం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన మహిళల కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. క్రీడల ద్వారా మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలు, ధర్మవరం హ్యాండ్‌లూమ్ కళాకృతులు, గ్రామీణ ఉత్పత్తులు, సౌర విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. ఇలాంటి స్టాల్స్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తాయని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa