ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 01:54 PM

సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. 'ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి' అంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ లింకులను క్లిక్ చేస్తే మొబైల్‌లోకి మాల్వేర్ చొరబడి, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి ఖాతాలు ఖాళీ అవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండగ వేళ ఎవరూ ఉచితంగా డబ్బులు పంచరని, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లు లింకుల ద్వారా డబ్బులు ఆఫర్ చేయవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa