ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 08:45 AM

క్రెడిబులిటీ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకి లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చి తప్పడమే బాబుకున్న క్రెడిబులిటీ అని... ఎవరి క్రెడిబులిటీ ఎంతో ప్రజలందరికీ తెలుసని తేల్చి చెప్పారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  వేదిక ఏదైనా వైయస్.జగన్ ను దూషించడమే బాబు లక్ష్యమని.. ఆత్మస్తుతి పరనింద బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. చివరకు ఆయన వర్ధంతి సభలోనూ   తన స్వోత్కర్షే చేసుకోవడంపై  తీవ్రంగా ఆక్షేపించారు . కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా భూపందేరానికి పాల్పడుతూ... కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమిని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, లిక్కర్ సహా అన్ని రకాలకు స్కామ్ లకు పాల్పడుతూ... ప్రజల కళ్లలో ఇసుక కొట్టిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు...  ప్రశ్నిస్తే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో ఎదురుదాడి చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఆర్వో ప్లాంట్లు తరహాలో నకిలీ లిక్కర్  ప్లాంట్లు నడుస్తున్నాయని... చివరకు మద్యం డోర్ డెలివరీ చేసే స్దితికి దిగజార్చిన ఘతన  బాబుదేనని మండిపడ్డారు. కూటమి పాలనలో ఏపీ డ్రగ్స్ డెన్ గా మారిందని కన్నబాబు స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa