ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 08:48 AM

బీసీల గౌరవాన్ని కాపాడుతూ వారికి రాజకీయ, సామాజిక జీవితంలో సముచిత స్థానం కల్పించినది వైయస్ కుటుంబమేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ రోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన నుంచి మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వరకు బీసీలు, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా పాలన సాగిందని తెలిపారు. వైయస్ కుటుంబ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని, సంక్షేమం–అభివృద్ధి సమపాళ్లలో అందించారని అన్నారు.ప్రస్తుత రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతోందని ఎంఎన్‌ ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోలీసు పాలన అమలవుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. ఇటువంటి అణచివేత ధోరణి పాలకుల పతనానికి నాంది అవుతుందని స్పష్టం చేశారు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ నిధులతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa