గురజాల అభివృద్ధి, ఎమ్మెల్యే హత్యా రాజకీయాలు, పల్నాడు ఫ్యాక్షన్, ప్రభుత్వ సంక్షేమం.. దేనిపైన అయినా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ తో తాను చర్చకు సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యరపతినేని ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ప్రతి గ్రామంలోనూ ప్రజల మధ్య అశాంతికి కారణమయ్యాడని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను బలి తీసుకోవడం రాజకీయం కాదని, దమ్ముంటే పల్నాడు గ్రామాలను అభివృద్ధి బాట పట్టించి శాంతి నెలకొల్పుదామని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలని, వ్యక్తిగత విమర్శలతో రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని హితవుపలికారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో డయేరియాతో చనిపోయిన ఏడుగురికి ప్రభుత్వం తరఫున ఏడాదిన్న అవుతున్నా ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. మందా సాల్మన్ హత్యకు ఎమ్మెల్యే యరపతినేని, సీఎం చంద్రబాబుదే బాధ్యత అని ఆరోపించారు. దేశంలో తొలిసారిగా అంత్యక్రియలకు ఆధార్ కార్డు చూపించాల్సిన దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లినందుకు వారు సిగ్గుపడాలని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ హయాంలో చేసిన పనులకే ఎమ్మెల్యే యరపతినేని శంకుస్థాపనలు చేసుకుంటున్నాడని చెప్పిన మహేష్రెడ్డి.. ఎమ్మెల్యేకు చేతనైతే వైయస్ఆర్సీపీ హయాంలోనే 60 శాతం పూర్తయిన గురజాల మెడికల్ కాలేజీని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa