రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామన్న తరహాలో పాలన సాగుతోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ఆక్షేపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు.అయన మాట్లాడుతూ.... ఒక పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పా? అదేమైనా నేరమా? మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ప్రజల కష్టాల నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ వైయస్ఆర్సీపీ. ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పార్టీని, అధినేతను ప్రేమించడం తప్పు ఎలా అవుతుంది?. జగన్గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీసింది. అందుకే 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మా పార్టీకి ఓటేశారు. పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చినా, 41 శాతం ఓటింగ్ రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. మరి అలాంటి నాయకుడిపై అభిమానంతో ఓటేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తారా?. ఎంత దారుణం?. భార్య అనారోగ్యంతో ఉందని తెలుసుకుని సొంత ఊరు పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిన్నెల్లికి వచ్చిన మంద సాల్మన్ను ఇనుప రాడ్లతో కొట్టి చంపడం ఏ సంస్కృతి? వైయస్ జగన్ను ప్రేమిస్తే, ఆయనకు ఓటు వేస్తే చంపేస్తారా?! అంటే, రాష్ట్రంలో 1.2 కోట్ల మంది దళితులకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు లేదా?. ఆ ఓటు హక్కు వినియోగించి జగన్గారికి ఓటు వేస్తే చంపేస్తామన్న హెచ్చరికగానే మంద సాల్మన్ను బలిగొన్నారు. కులాంతర వివాహాల పేరుతో జరిగిన పరువు హత్యలు చూశాం. కానీ ఒక పార్టీని ప్రేమించి ఓటు వేస్తే కూడా చంపుతామన్న పాలనను ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa