ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు రోగాల బారిన పడకుండా కమిటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 07:01 PM

AP: రాష్ట్రంలో హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 9 శాఖల అధికారులతో జిల్లాస్థాయిలో JACలను ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో ఈ కమిటీలు పనిచేస్తాయి. కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. JACల తనిఖీలు కేవలం నివేదికలకే పరిమితం కాకుండా, గుర్తించిన లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa