AP: YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు తాడపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa