టీ20 ప్రపంచకప్ 2026లో ఆడకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో జరిగే మ్యాచ్లు ఆడేందుకు తమ జట్టు నిరాకరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఆందోళనలు, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది.తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో ఈ విషయంపై చర్చించిన ఐసీసీ, భారత్లో భద్రతా సమస్యలు లేవని, షెడ్యూల్ను మార్చడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్కు ఒక రోజు గడువు ఇవ్వగా, బీసీబీ ఆ ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఢాకాలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్, ఆటగాళ్లు లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో తదితరులతో సమావేశమయ్యారు. ప్రపంచకప్ ఆడాలనే ఆసక్తి ఆటగాళ్లకు ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. "మేం ఐసీసీతో చర్చలు కొనసాగిస్తాం, మా పోరాటం ఆపబోం" అని బీసీబీ అధ్యక్షుడు ఈ సందర్భంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa