ఆధునిక కాలంలో చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తుల కంటే సహజ సిద్ధమైన నూనెలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆవనూనె, కొబ్బరి నూనెలను సమాన పాలుగా తీసుకుని ముఖానికి మృదువుగా మర్దనా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమం చర్మంలోని లోతైన పొరల్లోకి చొచ్చుకుపోయి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా, చర్మంపై ఉండే మలినాలు తొలగిపోయి ఎంతో తాజాగా కనిపిస్తుంది.
తరచుగా మొటిమల సమస్యతో బాధపడేవారికి ఆవనూనె ఒక చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. ప్రతిరోజూ పడుకునే ముందు లేదా స్నానానికి ముందు ఈ నూనెల మిశ్రమంతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది కేవలం చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, ముఖంపై పేరుకుపోయిన అలసటను తొలగించి సహజమైన మెరుపును తీసుకువస్తుంది.
మీ చర్మం నిర్జీవంగా, కాంతిహీనంగా కనిపిస్తున్నట్లయితే ఒక ప్రత్యేకమైన హోమ్ మేడ్ స్క్రబ్ను ప్రయత్నించవచ్చు. పావు కప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి, దానికి ఒక చెంచా బియ్యప్పిండిని చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకుని ముఖానికి లేదా ఒంటికి పట్టించాలి. రోజ్ ఆయిల్ చర్మానికి మంచి సువాసనను, తేమను అందిస్తే.. బియ్యప్పిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ సహజ సిద్ధమైన నలుగు (స్క్రబ్) చర్మంపై ఉన్న మృతకణాలను (Dead Cells) సమర్థవంతంగా తొలగిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా నలుగులా రుద్దుకోవడం వల్ల చర్మం రంగు మెరుగుపడటంతో పాటు మచ్చలు తగ్గుతాయి. రసాయనాలతో కూడిన స్క్రబ్ల కంటే ఈ మిశ్రమం చర్మానికి ఎటువంటి హాని చేయదు. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం మీ సొంతమవుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa