భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా, శనివారం జరిగే ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను 4-1 తేడాతో ఘనంగా ముగించాలని చూస్తోంది. అయితే, అందరి దృష్టీ మాత్రం కేరళ కుర్రాడు, హోం గ్రౌండ్లో బరిలోకి దిగుతున్న సంజూ శాంసన్పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు దారుణంగా విఫలమైన సంజూకి, తనను తాను నిరూపించుకోవడానికి ఇది సువర్ణావకాశం. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది.శుభ్మన్ గిల్పై వేటు వేయడంతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన సంజూ శాంసన్, ఈ సిరీస్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న ఈ మ్యాచ్లోనైనా భారీ స్కోరు సాధించి, తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అతను పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు, ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్లో రాణించడం సంజూ కెరీర్కు అత్యంత కీలకం కానుంది. తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో అతను తప్పక రాణించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa