ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 03:31 PM

AP: ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. గంపలగూడెం మండలం సత్యాలపాడులో శుక్రవారం రాత్రి 15 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. వారందరికీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ క్రియాశీలక కార్యకర్తలైన ముక్కెర కోటిరెడ్డి, అవులూరు భార్గవరెడ్డి, వరదబోయిన గోపి, సంపసాల నారాయణ, ముక్కెర రాజశేఖరరెడ్డి, వెంకటమ్మ, సత్యనారాయణరాజు, సరికొండ గోపరాజు, మురళి తదితరులు పార్టీలో చేరినట్లు గోవర్ధనరెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa