తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా అనే అనుమానాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. 2022 మే నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరుగుతోంది. ఈ సంస్థకు సొంత డైరీ లేదని, ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి ఆలయానికి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యి వాడినట్లు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదని, ప్రయోగశాల పరీక్షల్లోనూ స్పష్టమైన ఆధారాలు లభించలేదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు.అధికారుల సమాచారం ప్రకారం, 2022 మే నుంచి 2023 మార్చి వరకు మొత్తం 11 నెలల కాలంలో రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలానికి 3,25,064 కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఈ పరిమాణం పెద్దదిగా ఉండటంతో, నెయ్యి నాణ్యతపై మరింత లోతైన విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయోగశాల పరీక్షల్లో గానీ, అధికారిక విచారణలో గానీ ఇప్పటివరకు నెయ్యి కల్తీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. అలాగే, రాజేష్ కార్పొరేషన్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa