రాయలసీమకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేయాలని వైయస్ఆర్సీపీ కర్నూలు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, రాయలసీమ దశాబ్దాలుగా నీటి సమస్యతో సతమతమవుతోందని, కృష్ణా జలాల న్యాయమైన వాటాను పూర్తిస్థాయిలో అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే రైతులు, సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని, రాయలసీమ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ఆమె నొక్కి చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వేగంగా అమలు చేయబడిందని, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వబడిందని ఆమె గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa