భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుండి ప్రారంభమవుతోంది.నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు, ఇప్పటి వరకు ప్రపంచంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. సుమారు 35,000 మందికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదై ఉంటాయి. ప్రభుత్వాలు, దేశీయ మరియు అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నట్లు అంచనా. అంతేకాక, 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీల 40 మంది పైగా సీఈఓలు సదస్సులో పాల్గొననుండనున్నారు.సదస్సు ప్రారంభానికి ముందే రాజధానిలో హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు, ఫిబ్రవరి 16న ఇంపీరియల్ హోటల్ లో ఒక రాత్రి గది ఖర్చు ఒక వ్యక్తికి రూ. 1,97,049 గా ఉంది. దీని పై అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించవలసి ఉంటుంది.తాజ్ ప్యాలెస్ లో ప్రెసిడెన్షియల్ సూట్ ధర ఒక రాత్రికి సుమారు రూ. 30 లక్షలు. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500 మాత్రమే. హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ.78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్ లో కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండగా, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa