ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎన్పీ ఘన విజయం....ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్దరఫై భారత్ ఆశాభావం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:41 PM

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ( బీఎన్పీ) ఘన విజయంతో ఆ దేశంలో నెలకున్న అనిశ్చితికి ముగింపు పడ్డటయ్యింది. దీంతో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఏడాదిన్నరగా క్షీణిస్తున్న దౌత్యసంబంధాలను పునఃప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో ఏ విధంగా వ్యవహరించాలి, అనుసరించాల్సి చర్యలు ఏంటి? అనేది భారత్ పరిశీలిస్తోంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలదనే ముందు నుంచి కేంద్రం వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి తాజా ఎన్నికల ఫలితం బలం చేకూర్చింది.


 భారత వ్యూహాత్మక దృష్టికోణంలో చూస్తే.. తాజా ఎన్నికల ఫలితాలు మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలనకు ముగింపుగా భావిస్తున్నారు. యూనస్ పాలనను న్యూఢిల్లీ-ఢాకా సంబంధాల్లో సంధి కాలంగా భారతీయ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. యూనస్ హాయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దిగజారాయి. మైనార్టీలపై దాడులు, అరాచక శక్తులను ప్రోత్సహించడం వంటివి ఇందుకు కారణం. ప్రజా మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వంతోనే న్యూఢిల్లీ ఎప్పుడూ పనిచేసిందని, ప్రజాస్వామ్య విధానాల పట్ల భారత్ తన గౌరవాన్ని పునరుద్ఘాటించింది


యూనస్ పాలనలో భారత్ అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించింది మైనార్టీలైన హిందువుల హత్యలు, బెదిరింపులపై చర్యలు తీసుకోకపోవడం. దీనిపై భారత పలుసార్లు తన ఆందోళనను బహిరంగంగానే వ్యక్తం చేసింది. రాజకీయ వేదికల్లో ఇస్లామిక్ వేర్పాటువాదులు, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చోటుకల్పించిందని ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ సంబంధాల పునరుద్దరణకు భారత్ సరైన అవకాశంగా భావిస్తోంది. దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల తిరిగి గాడిలో పెట్టేందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతోంది.


ఇక, బంగ్లాదేశ్‌కు కాబోయే కొత్త ప్రధాన మంత్రి తారిక్ రెహమాన్ తీసుకోబోయే నిర్ణయాలపైనే భారత్ తదుపరి చర్యలు ఉంటాయి. గతంతో బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు నెలకున్న విబేధాలను గుర్తుచేసుకుంటూనే.. ప్రస్తుతం ఆర్ధిక విధానాలు, ప్రాంతీయ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రెహమాన్ వాస్తవిక దౌత్య విధానాన్ని అవలంభిస్తారని భారత్ భావిస్తోంది.


ఇక, ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రెహమాన్‌కు అభినందనలు తెలిపారు. రెండు దేశాల శాంతి, పురోగతి, శ్రేయస్సు భారత్ కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ఇక, రెహమాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున ప్రతినిధి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనే భారత సంసిద్ధతను తెలియజేస్తుంది. ఇదే క్రమంలోనే బీఎన్పీ అధ్యక్షురాలు, బంగ్లా మాజీ ప్రదాని ఖలీదా జియా మరణించగా.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢాకాకు వెళ్లి ఆమెకు నివాళులర్పించారు. ఇవన్నీ పరిశీలిస్తే భారత్ వ్యూహాత్మక దృక్పథం స్పష్టమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa