హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గురువారం లేపాక్షి మండలంలో పర్యటించిన ఆయన, రెండు కీలకమైన బీటీ రహదారుల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళ్తే, మండలంలోని మానేపల్లి నుంచి గౌరిగానిపల్లి వరకు రూ.2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రహదారి పూర్తయితే స్థానిక గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరుతాయని తెలిపారు. అనంతరం ఆయన పులమతి చెరువు వద్దకు చేరుకుని, హంద్రీనీవా జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు.ఇదే పర్యటనలో భాగంగా కొత్తపల్లి నుంచి నాగేపల్లి వరకు నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా బాలకృష్ణ భూమిపూజ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa