ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2026లోనూ ఆడనున్న ఎంఎస్ ధోనీ అధికారికంగా స్పష్టం చేసిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 07:19 PM

చెన్నై సూపర్ కింగ్స్  అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని సీజన్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2026లో కూడా ఆడతాడని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ధోనీ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్ పడింది.ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సుమారు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై సీఈఓ స్పష్టత ఇచ్చారు. అతను ఆడతాడు, ఈ సీజన్ లో తప్పకుండా ఆడతాడు అంటూ విశ్వనాథన్ చేసిన వ్యాఖ్యలతో ‘యెల్లో ఆర్మీ’లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో రెండేళ్ల పాటు జట్టుపై నిషేధం విధించినప్పుడు మాత్రమే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ఆడాడు.44 ఏళ్ల వయసులోనూ జట్టుకు మార్గదర్శకత్వం అందిస్తూ ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఘనత ధోనీది. ఇటీవల కామెంటరీ గురించి మాట్లాడుతూ అది చాలా కష్టమైన పని అనిఆటగాళ్లను విమర్శించకుండా వ్యాఖ్యానం చేయడం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు.2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో ధోనీ ప్రభావం తగ్గలేదు. మార్చి చివరిలో మొదలుకానున్న ఐపీఎల్ 2026లో ‘తలా’ను మరోసారి మైదానంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa