ICC Men's T20 World Cup 2026లో టీమిండియా యువ బ్యాటర్లు Abhishek Sharma, Tilak Varma ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. అభిషేక్ వరుసగా మూడు ఇన్నింగ్స్లలో డకౌట్ అవగా, తిలక్ నెమ్మదైన బ్యాటింగ్తో అభిమానులను నిరాశపరుస్తున్నాడు.ఆదివారం అహ్మదాబాద్లో South Africa national cricket teamతో జరిగిన సూపర్-8 పోరులో ఇద్దరూ విఫలమయ్యారు. అభిషేక్ కేవలం 13 పరుగులకే పరిమితమయ్యాడు. తిలక్ అయితే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ల్లో తిలక్ 21.40 సగటుతో 107 పరుగులు మాత్రమే సాధించాడు. అతని స్ట్రైక్రేట్ 119 కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ Sadagoppan Ramesh కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయించలేకపోతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.“అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం గ్రహించాలి. ఇప్పటివరకు వారు అనుభవించింది తోట మాత్రమే; కానీ ప్రపంచకప్ అనేది అడవి లాంటిది. అక్కడ నిలదొక్కుకోవాలంటే పోరాడాలి, లేదంటే ఒత్తిడికి లోనవుతారు. ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని ఆడటం నేర్చుకోవాలి” అని రమేష్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వ్యాఖ్యానించారు.డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ తొలి సూపర్-8 మ్యాచ్లోనే ఓటమి చవిచూడటంతో సెమీఫైనల్ అవకాశాలు కష్టతరమయ్యాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తేనే భారత్కు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa