International Cricket Council నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-8 దశలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ను ఎంచుకుంది.చెన్నైలోని M. A. Chidambaram Stadium వేదికగా జరుగుతున్న ఈ పోరులో భారత ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు దూకుడుగా ఆరంభించారు. ఫోర్లు, సిక్సర్లతో తొలి మూడు ఓవర్లలోనే స్కోరును 45 పరుగులకు చేర్చారు.అయితే 3.4 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్ను కోల్పోయింది. సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ముజర్బానీ బౌలింగ్లో బర్ల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 48 పరుగులు.అభిషేక్ శర్మ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు, మొత్తం 30 బంతుల్లో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు నాలుగు మ్యాచ్ల్లో కలిపి కేవలం 15 పరుగులే చేసిన అభిషేక్ ఈ ఇన్నింగ్స్తో ఫామ్లోకి వచ్చినట్టు చూపించాడు.మరోవైపు, మంచి లయలో కనిపించిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ క్రీజులో నిలిచారు.ఈ కీలక మ్యాచ్కు భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. అక్షర్ పటేల్, సంజూ శాంసన్లను తిరిగి జట్టులోకి తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్లను తప్పించారు. జింబాబ్వే జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది.సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. జింబాబ్వేపై విజయం సాధిస్తే, తదుపరి మ్యాచ్లో వెస్టిండీస్ను కూడా ఓడించాల్సిన అవసరం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa