భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, వివాహాలు, శుభకార్యాలు అంటే బంగారం కొనడం అనేది సాంప్రదాయంగా మారింది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి.2026లో ధరలు తగ్గుతాయనే ఆశతో చాలామంది ఎదురు చూస్తుండగా, తాజా అంచనాలు మాత్రం షాక్కు గురిచేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ JPMorgan Chase బంగారం భవిష్యత్ ధరలపై విడుదల చేసిన నివేదికలో, ప్రస్తుతం కనిపిస్తున్న పెరుగుదల కేవలం ప్రారంభమేనని పేర్కొంది. అసలు గోల్డ్ ర్యాలీ ఇంకా ముందుందని విశ్లేషించింది.
*2026 నాటికి భారీ జంప్? : ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 5,200 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే ఇది 6,300 డాలర్ల స్థాయిని తాకే అవకాశముందని అంచనా. అంతర్జాతీయ ధరలు పెరిగితే భారత మార్కెట్పై దాని ప్రభావం మరింతగా ఉంటుంది.ఇప్పటికే దేశంలో ఒక సావరిన్ (8 గ్రాములు) బంగారం ధర రూ.1,19,360 వద్ద ఉంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఒక గ్రాము బంగారం కొనడానికే వేల రూపాయలు వెచ్చించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు.
*ధరల పెరుగుదలకు కారణాలేంటి? : అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై సంకేతాలు రావడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతున్నారు. యుద్ధాలు, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం కూడా డిమాండ్ పెరగడానికి కారణం.దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది లాభదాయకమై ఉండొచ్చు. కానీ ఆభరణాల కోసం కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది అదనపు భారం. ధరలు తగ్గుతాయనే ఆశతో ఎక్కువకాలం వేచి ఉంటే, మరింత అధిక ధర చెల్లించాల్సి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోలు నిర్ణయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa