ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 06:18 PM

ఏపీ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం జరిగింది. వెలగపూడి సీడ్ యాక్సిస్ రెడ్డులోని ఎన్9 జంక్షన్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎల్అండ్‌టీ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. భారీ శబ్ధంతో పైపులు తగలబడిపోయాయి. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ విస్తరించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పరిసర ప్రాంతమంతా నల్లని పొగ కమ్మేసింది. దీంతో భయపడిపోయిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను నియంత్రించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa