Indian Premier League 2026 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో Board of Control for Cricket in India కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ల సమయంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు, బెంచ్లో ఉన్న ప్లేయర్ల విషయంలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ Cricbuzz వెల్లడించింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం, మ్యాచ్ స్క్వాడ్లో ఉన్న 16 మంది ఆటగాళ్లకే మైదానంలోకి అనుమతి ఉంటుంది. మిగతా ఆటగాళ్లు తప్పనిసరిగా డగౌట్లోనే ఉండాలి. మైదానంలో క్రమశిక్షణను మెరుగుపరచడం, అనవసర రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులపై అధికారికంగా కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు.ఇంకా కొత్త నిబంధనల ప్రకారం, ఒకేసారి బౌండరీ లైన్ సమీపంలో గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లకే అనుమతి ఉంటుంది. గతంలో బంతిని తెచ్చేందుకు లేదా ఫీల్డర్లకు సందేశాలు అందించేందుకు పలువురు ఆటగాళ్లు బౌండరీ దగ్గర తిరుగుతూ ఉండేవారు. కానీ ఇకపై ఐదుగురి కంటే ఎక్కువమంది అక్కడ ఉండకూడదు.ప్లేయింగ్ ఎలెవెన్లోని 11 మంది, ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లోని ఐదుగురు కలిపి మొత్తం 16 మందికే మైదానంలో చలనం ఉంటుంది. ప్లేయింగ్ ఎలెవెన్లో లేని ఐదుగురు ఆటగాళ్లు తప్పనిసరిగా బిబ్స్ ధరించాలి. అలాగే ఎల్ఈడీ ప్రకటనల బోర్డుల సమీపంలో అనవసరంగా తిరగడంపై కూడా కఠిన ఆంక్షలు విధించారు.మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రమశిక్షణను కాపాడటం, అనవసర గందరగోళాన్ని తగ్గించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో డ్రింక్స్ తీసుకువెళ్లే ఆటగాళ్లు కెప్టెన్కు కోచ్ సందేశాలను చేరవేసే వారు. ఇకపై అలాంటి బాధ్యతలు కూడా ఆ 16 మంది ఆటగాళ్లకే పరిమితం కానున్నాయి.ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, “మ్యాచ్ సమయంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు మైదానంలో తిరగరాదని తాజాగా ఆదేశాలు అందాయి. కూల్డ్రింక్స్ తీసుకెళ్లడానికైనా ప్రత్యేక అనుమతి లేదు. జట్టులో ఎంపికైన 16 మంది మాత్రమే ఆ పనులు చేయగలరు. మిగిలినవారు డగౌట్లోనే ఉండాలి. బౌండరీ లైన్ లేదా ఎల్ఈడీ బోర్డుల దగ్గర తిరగడం పూర్తిగా నిషేధం” అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa