మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత పెద్దగా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడని లోకేష్ బాబు. ట్విట్టర్ లో మాత్రం ఎప్పటికప్పుడు ట్విట్స్ వేస్తూ, మంచి హంగామా చేస్తూ ఉంటాడు. తాజాగా లోకేష్ వేసిన ట్విట్ నేరుగా జగన్ ని తాకేలా ఉంది. కాకపోతే దానిలో అసలు విషయమెంత అని ఆలోచిస్తూ లోకేష్ ట్విట్ రాంగ్ ఫైర్ అయ్యిందనే చెప్పాలి. మొన్న ఒంగోలులో వెలుగులోకి వచ్చిన అత్యంత దారుణమైన అత్యాచారం గురించి ఇప్పుడు రాష్ట్రము మొత్తం మాట్లాడుకుంటుంది. ఆయా నిందుతులకి కఠినమైన శిక్షలు పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
సరిగ్గా ఇదే పాయింట్ ని లోకేష్ బాణంగా ఎక్కుబెట్టి సాధించాలని చూశాడు. ఆ సంఘటనలో ప్రధాన నిందితుడు బాజీ వైసీపీ కార్యకర్త, అతను జగన్ పాదయాత్ర టైములో కలిసి ఫోటో దిగాడు, అతని పేస్ బుక్ లో కూడా జగన్ కి సపోర్ట్ గా పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. వాటిని ఆధారంగా చేసుకొని లోకేష్ మాట్లాడుతూ “ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది”. అంటూ లోకేష్ మాట్లాడాడు.
అయితే ఇక్కడ లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అత్యాచారాలు జరుగుతున్నాయని, పరిపాలన సరిగ్గా లేదని విమర్శించవచ్చు.కానీ జగన్ తో ఫొటోలో ఉన్నాడు, వైసీపీ కార్యకర్త ఇలా చేశాడని చెపుతూ ఫొటోలు పెట్టటం అనేది అంత కరెక్ట్ కాదు. ఇదొక విష సంసృతి అనే చెప్పాలి. ఒక సంఘటనలో నిందితుతు దొరికితే చాలు ముందు అతను ఏ పార్టీ అంటూ ఆరాలు తీసి పోస్టులు పెడుతారు. అయినా ఇలాంటి పనులు చేయమని ఏ పార్టీలు కూడా ప్రోత్సహించవు. లక్షల మంది కార్యకర్తల్లో కొందరు వెదవలు ఉంటే దానికి పార్టీని నిందించటం కరెక్ట్ కాదు. ఏమైనా ఆ పార్టీకి చెందిన పెద్ద స్థాయి నాయకులు చేస్తే దానికి పార్టీ బాధ్యత వహించాలని అడగవచ్చు కానీ, ఇలా ఒక కార్యకర్త చేసిన పనిని ఎట్టి చూపిస్తూ మీ వాళ్లే దానికి కారణం అనటం తప్పు.
అలా అయితే గతంలో చంద్రబాబునాయుడు కొందరి నిందితులతో కలిసివున్న ఫోటోలు చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు బాధ్యత అంటే బాగుంటుందా..? నేరాలు అనేవి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో భాగం చేస్తారు, తప్పితే పార్టీ ప్రభావం వలన చేయరు. ఇలా నేరగాళ్లకు పార్టీ ముద్ర వేయటం అనేది మంచిది కాదు. ఇలాంటి వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవటం దారుణం. ఒంగోలు సంఘటనకి వైసీపీ కి లింక్ పెడుతూ రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి, సోషల్ మీడియా కాబట్టి అది వేరు. కానీ ఒక బాధ్యత కలిగిన లోకేష్ లాంటివాళ్లు కూడా ఇలా చవకబారు ఆరోపణలు చేయటం సమంజసం కాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa