స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఇక నుంచి తమ దగ్గర ఏటీఎం కార్డు వాడితే ఖచ్చితంగా సంవత్సరానికి రూ.125 వసూలు చేయాలని నిర్ణయింది. అలాగే కార్డు మార్చుకునేందుకు రూ.300లు కట్టాల్సి ఉంటుందంటూ ఈ మేరకు సరి కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఏటీఎం కార్డు ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వారికి పరిమితులు విధించడంతో పాటు ఆన్లైన్ లావాదేవీల విషయంలోనూ షరతులు షురూ చేసింది.
ఇకనుంచి ఎస్బీఐ తన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డుల నుంచి రోజుకు రూ. 40,000 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, . అలాగే ఆన్లైన్ డబ్బులు రూ 75,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని . ఒకవేళ పరిమితికి మించి ఎక్కువసార్లు నగదు తీసుకున్నట్లైతే అదనపు చార్జీలు వసూలు చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
దీనికి తోడుగా. పిన్ నెంబర్ మార్పు, చెక్ బుక్ కోసం దరఖాస్తు, బిల్లుల చెల్లింపు, ఐఎంపీఎస్ రిజిస్ట్రేషన్, మొబైల్ ఫోన్లకు రీచార్జ్ వంటి సర్వీసులును ఎస్బీఐ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే చిన్న పాటి మెత్తాల కోసం ఏటిఎం వాడితేనే సేవల పేరిటి వీరబాదుడు బాదుతున్న ఎస్ బిఐ ఖాతాదారులు మరిన్ని కష్టాలు పడాల్సి రావచ్చు. ఇక ఏటిఎం వాడే ముందు జర జాగ్రత్త.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa