ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఒక్క పని చేస్తే చాలు,,,, ఆ 'ఆదాయం' లక్ష దాటినా నో ట్యాక్స్

business |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 11:07 PM

పదవీ విరమణ తర్వాత చాలా మంది సీనియర్ సిటిజన్లు (60 సంవత్సరాల వయసు దాటినవారు) తమ జీవితకాల కష్టార్జితాన్ని సురక్షితమైన రాబడి కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే, ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైన ట్యాక్స్ పడకుండా పరిమితి ఉంది. ఈ లిమిట్ దాటితే బ్యాంకులు టీడీఎస్ (Tax Deducted at Source) విధిస్తాయి. కానీ, సరైన వ్యూహాలు పాటిస్తే లక్ష రూపాయల కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి అది ఎలా సాధ్యమవుతుందనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.


టీడీఎస్ పరిమితి ఎంత?


సాధారణంగా 60 ఏళ్ల లోపు వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయం ఏడాదికి రూ. 50,000 దాటితే బ్యాంకులు టీడీఎస్ విధిస్తాయి. అయితే, సీనియర్ సిటిజన్ల (60 ఏళ్లు పైబడిన వారు) విషయానికి వస్తే ఈ పరిమితి రూ. 1,00,000 వరకు ఉంటుంది. గతంలో రూ.50 వేలుగా ఉన్న పరిమితిని ఏప్రిల్ 1, 2025 నుంచి లక్షకు పెంచారు. అంటే ఏడాదికి రూ.1,00,000 వరకు వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను కోత ఉండదు. ఒకవేళ వడ్డీ ఈ పరిమితిని మించితే అప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది.


సీనియర్ సిటిజన్లు తమ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, వారు తమ వడ్డీపై టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు తమ బ్యాంక్ బ్రాంచ్‌లో ఫామ్ 15H సమర్పించడం ద్వారా టీడీఎస్ కోతను నివారించవచ్చు. ఇది ఒక డిక్లేర్డ్ ఫామ్. 'నా మొత్తం ఆదాయం పన్ను పరిమితి లోపే ఉంది, కాబట్టి నా వడ్డీపై పన్ను కోయకండి' అని బ్యాంకుకు విన్నవించడం అన్నమాట.


రూ.1 లక్ష పైన ఉంటే ఎలా?


ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకులోని వడ్డీ ఆదాయం రూ.1 లక్ష దాటితేనే టీడీఎస్ అనేది కట్ చేస్తారు. అయితే, రెండు వేరు వేరు బ్యాంకుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1 లక్ష దాటినా టీడీఎస్ అనేది కట్ కాదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఓ సీనియర్ సిటిజన్ ఏడాదికి రూ.90 వేలు వడ్డీ ఆదాయం పొందుతున్నాడు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.80 వేల వడ్డీ ఆదాయం అందుకుంటున్నాడు అనుకుందాం. అయితే, అతిని మొత్తం వడ్డీ ఆదాయం రూ.1,70,000 అవుతుంది. అంటే లక్ష రూపాయల లిమిట్ దాటింది. అయినా ఈ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అనేది కట్ కాదు. ఎందుకుంటే ఏ ఒక్క బ్యాంకులోనూ లిమిట్ దాటలేదు.


ప్రస్తుతం బ్యాంకులు గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. రూ.12-13 లక్షల వరకు బ్యాంకులో గరిష్ఠ వడ్డీ రేటుపై డిపాజిట్ చేసినట్లయితే ఏడాదికి రూ.1 లక్ష వరకు వడ్డీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించి అంటే రూ.15 లక్షలు, రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ ఆదాయం లక్ష రూపాయల లిమిట్ దాటుతుంది. దీంతో టీడీఎస్ కట్ అవుతుంది. ఎలాంటి ట్యాక్స్ కట్ కావద్దు అనుకుంటే ఒకే బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వేరు వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించడం ద్వారా టీడీఎస్ నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa