ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 10:12 AM

అమరావతి: ఇవాళ లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడు అని పేర్కొన్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి.. లోక్‌సభ స్పీకర్‌ స్థాయికి ఎదిగారని కొనియాడారు.‘‘సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జీఎంసీ బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa