ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 07:08 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండురోజులుపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పిఠాపురం నియోజకవర్గంలో పలు కాలనీలు, పంటపొలాలు,పల్లపుప్రాంతాలు నీటమునిగాయి.ఇళ్ళల్లోకికూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గొల్లప్రోలులో నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు,పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. కరణంగారితోట,శివాలయం మాన్యం,దేవీనగర్,ఈబీసీ కాలనీలలో ఆయన పర్యటించి,సమస్యపైన,ప్రజల ఇబ్బందులపైన అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ.,ఏలేరు ఆధునికీకరణ పనుల విషయంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు వహించిన నిర్లక్ష్యం వలనే గొల్లప్రోలు ముంపుకు గురికావడం కొనసాగుతూనే ఉందని,ముంపు సమస్యకు శాశ్వతపరిష్కారం ఏలేరు ఆధునీకరణతోనే జరుగుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa