ఈ నెల 24న గన్నవరం మండలం సూరంపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్ స్వఫ్నిల్ దినకర్ పుండ్కర్ పోలీసులను ఆదేశించారు. స్థానిక సిపెట్ కార్యాలయంలో మంగళవారం సీఎం పర్యటనకు సంబంఫధించి డీసీపీ హర్షవర్ధనరాజుతో కలసి సబ్ కలెక్టర్ సమీక్షించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24న ఉదయం 10.30గంటల నుంచి 11.50 గంటల వరకు సీఎం పర్యటన సూరంపల్లిలో ఉంటుందన్నారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి సదానంద గౌడ పాల్గొంటారని చెప్పారు. 10.30 గంటలకు సదానందతో కలసి సిపెట్ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతతం అదే సమావేశం ఆవరణలో జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం 11.50 గంటలకు పూర్తి బందోబస్తు చెయ్యాలని, ప్రముఖుల వాహనాలకు పార్కింగ్ స్థలాలను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డిసిపి.ఉదయరాణి, అదనపు డీసీపీ కిరణ్కుమార్, ఆర్.అండ్ బి శాఖ ఈఈ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa