ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు శివసేనకు మద్దతిస్తే....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 11:15 PM

 ఎటువంటి ప్రచారం చేయకుండా ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించని కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ గతంలో కన్నా కొన్ని సీట్లు ఎక్కువగా సాధించారు. మరీ ముఖ్యంగా ఎన్సీపీ అయితే యాభై మార్కును దాటింది, గతంలో ఎన్సీపీ కేవలం నలభై రెండు, నలభై మూడుకు మాత్రమే పరిమితమైంది. గతంతో పోలిస్తే బీజేపీ ఆధిక్యం తక్కువ సీట్లలో కనిపిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పని చేసినప్పటికీ ఊహించిన ఫలితాలు రాలేదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రైతు సమస్యల కారణంగా రెండు రాష్ట్రాలలో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో మహారాష్ట్రలో బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక మిత్ర ప‌క్ష‌మైన శివసేన బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కూడా ఎక్కువ సీట్లలో ఆధిక్యం కనబర్చింది. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు శివసేనకు మద్దతిస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరితే కమలనాథులు తలలు పట్టుకునే పరిస్థితి రావచ్చు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa