ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నువ్వెంటో నిరూపించుకో: గౌతమ్ గంభీర్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 07:50 PM

జాతీయ జట్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో అని టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించారు. గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్‌ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ లోపాలతో జట్టుకు దూరమయిన శాంసన్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటాడు. దీంతో 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి అతనికి మళ్లీ పిలుపొచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్‌కు చోటు దక్కింది. చివరగా అతడు 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. టీ20 సిరీస్‌లో శాంసన్‌ ఎంపికవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా కాలంగా సంజు శాంసన్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని గంభీర్ అంటున్న విషయం తెలిసిందే. చివరకు తన మాట నెగ్గడంతో ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసాడు. అంతేకాదు శాంసన్‌కు ఓ సూచన కూడా చేసాడు. 'శాంసన్‌ చాలా గ్యాప్ తర్వాత అవకాశం దక్కించుకున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. టీ20 జట్టులో ఎంపికైనందుకు అభినందనలు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో' అని రాసుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa