ఈనెల 25న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇసుక, ఇతర సమస్యలపై ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనకుండా దూరంగా ఉండడంఆ పార్టీలో దుమారం రేపుతోంది. అందునా వీరిలో ప్రకాశం జిల్లా వారు కూడా ఉండటం టీడీపీ శ్రేణులను నివ్వెరపరిచింది. వీరిలో చీరాల ఎమ్మెల్యే చెందిన కరణం బలరామకృష్ణమూర్తి ,కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు , ఏ క్షణమైన టీడీపీని వీడవచ్చనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమానికి వీరు డుమ్మా కొట్టడం వెనుక లెక్కేంటని పార్టీ శ్రేణులలో మీమాంశ నెలకొంది.
ఈ నలుగురు శాసనసభ్యులలోలో గొట్టిపాటి రవికుమార్ 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు పిలుపుతో 2016లో టీడీపీలో చేరిపోయాడు. ఇప్పుడు తన మాతృపార్టీలోకి తిరిగి వెళ్లేందుకు రెడీ అవుతు, తన పాత పరిచయాలను ఉపయోగిస్తున్నాడని సమాచారం. అయితే పదవికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ స్పష్టం చేస్తుండటమే వీరికి ఇబ్బంది కలిగిస్తోందట. ఇప్పటికే వీరంతా తెరవెనుక మంతనాలు షురూ చేసారని సమాచారం. ఇక గన్నవరం శాసనసభ్యుడు వంశీ ఇప్పటికే జగన్ని కలసి స్పష్టమైన హామీ పొందారన్నవార్తలొస్తున్నాయి. శాసనసభ్యులు చేజారే ఆస్కారం లేదన్న ధీమా తెలుగుదేశంలో మేకపోతు గాంభీర్యం కనిపిస్తోంది. ఏం జరగనుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa