ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండపేట లో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 12:05 PM

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మహనీయ మహ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలను ఆదివారం మండపేటలో వైభవంగా నిర్వహించారు. జల్సా ఏ మిలాద్ ఉన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. మండపేట హన్ ఫీ అహలే సున్నత్ వల్ జమాత్, జామియా మస్జిద్ కమిటీ సభ్యులు, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మహనీయ దైవప్రవక్త మహమ్మద్ రసులుల్లాహ్ వారి జయంతి సందర్భంగా మండపేట హన్ ఫీ అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మస్జిద్ కమిటీ సభ్యులు, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జయంతి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాంతి యాత్ర నిర్వహించారు. కలవపూవ్వు సెంటర్ లోని ప్రాచీన, ప్రసిద్ధి చెందిన జామియా మస్జిద్ నుండి శాంతి యాత్ర ,ర్యాలీ జూలూస్ ఆరంభించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు.సైదల్లి పేట,గాంధీ నగర్,ప్రార్ధసారధి నగర్, బస్ స్టాండ్,రాజరత్న సెంటర్, టాక్సీ స్టాండ్,మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మండపేట జామియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ పైన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రవక్త జీవనశైలి, ఆలోచన విధానం, సంఘసంస్కర్తగా ఆయన చేసిన ఉపకారాలు తదితర అంశాలను విజయవాడకు చెందిన ప్రముఖ ముస్లిం ఆధ్యాత్మిక ప్రసంగీకులు మహమ్మద్ ఇంతి ఖబ్ అహమ్మద్ ఖాదరి రజ్వి వివరించారు. అలాగే అంగర ,ద్వారపూడి, మండపేట జామియా మసీదు ఇమాం లు నజీం అక్తర్ నూరి, షాంషాద్ రాజా నైమి, గులాం మొహమ్మద్ మూర్షిద్ రజ్వి లు ప్రసంగించారు. మధ్యాహ్నం ఫాతిహా , ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ముస్లిం లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa