శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వచ్చేసారు. హకీంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు.
ఈనెల 20 నుంచి 28 వరకు ఆయన దక్షిణ భారత దేశాన్ని పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ని గవర్నర్ బంగ్లా మీడియాకు విడుదల చేసింది. 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి 21న విశ్రాంతి తీసుకుంటారు. 22న రాజ్ భవన్ లో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ను ఆవిష్కరిస్తారు. ఆపై 23 ఉదయం ప్రత్యేక విమానంలో బయలు దేరి పుదుచ్చేరి వెళ్లి అక్కడి యూనివర్సిటీ యాన్యువల్ కాన్వొకేషన్ లో పాల్గొంటారు. ఆపై 25న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శిస్తారు. 26 ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
27న రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధి కారులకు విందు ఇస్తారు. 28న తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa