ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబానీకి షాక్ ఇచ్చిన మోదీ సర్కార్!

national |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 09:44 PM

రిలయర్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రో కెమికల్స్ వ్యాపారంలో 25 శాతం వాటాలను కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రిలయన్స్ వ్యాపారంలో 25 శాతం వాటాలను ఆరామ్‌కో కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని బారత ప్రభుత్వం అడ్డుకొన్నట్లు జాతీయ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటీష్ గ్యాస్‌పై కొనసాగుతున్న కేసు లో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయి తీసుకొన్నటు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ విచారణ చేపట్టనున్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనారిటీ(25 శాతం) వాటాను కొనుగోలు చేయడానికి ఆరామ్‌కో కంపెనీ 1000 1500 కోట్లు ఖర్చు చేయాలని అనుకొంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది. మార్కెట్ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa