ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలోని స్వల్ప భూప్రకంపనలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 12:46 PM

మహారాష్ట్రలోని సతరా జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కోయ్నా రీజియన్ లో ఉదయం 6:42 గంటలకు భూమి కంపించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.6గా నమోదైంది. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కోయ్నా డ్యామ్ కు 8 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు పేర్కొన్నారు.మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలోనూ ఈ నెల 14వ తేదీన భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. దహను తాలుకాలోని దుండల్‌వాడి గ్రామంలో 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ఆ గ్రామంలో భూమి కంపించిన మాట వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 5:22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. 13వ తేదీ మధ్యాహ్నం 12:26 గంటలకు తొలిసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు కాగా, ఆ రోజు రాత్రి 9:55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఈ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa