ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 09:12 PM

వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ అభివృద్ధి చెందిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానన్న టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. వైయస్ హయాంలోనే విశాఖకు పరిశ్రమలు, ఐటీ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కన్సల్టెన్సీ కంపెనీలు ఇచ్చే నివేదికలనే చంద్రబాబు అభివృద్ధి అనుకుంటున్నారని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. తమ పాలనలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa